మార్గదర్శకులు మహర్షులు మొదటి భాగం (Margadarsakulu Maharshulu Part One)
Book Description
సనాతన ధర్మానికి,భారతీయ సంస్క్రుతికి మార్గదర్సకులైన 41మంది మహర్షుల మహనీయ గాథలను వివరిస్తూ సద్గురు శివానందమూర్తిగారు 1994లో రుద్రయాగ సందర్భంలో చేసిన అమోఘ ప్రసంగాలకు గ్రంథ రూపమీ గ్రంథం. ఒక్కొక్క మహర్షి గురించి గొప్ప పండితులకు కూడా తెలియని అనేక విషయాలను, వారి మాటల, చేతల వెనుక ధర్మసూక్ష్మాలను, వారి లీలల వెనుక ఆధ్యాత్మిక రహస్యాలను, కలకాలం గుర్తుండేలా సామాన్యులకు సైతం ఆసక్తికరంగా ఇందులో విశదీకరించారు. ఇటువంటి ఉద్గ్రంథం ఇంతవరకూ తెలుగులో లేదు. మొదటి సంపుటంలో అగస్త్య, అత్రి, అష్టావక్ర, కర్దమ, కపిల, కస్యప, భ్రుగు, అంగిరస, పులస్త్య, గౌతమ, చ్యవన, దుర్వాస, జమదగ్ని, దధీచి, వసిష్ఠ విశ్వామిత్ర, మార్కండేయ, భరద్వాజ, కణ్వ, జాబాలి మహర్షుల సమగ్ర జీవిత చిత్రాలున్నాయి. ఈ గ్రంథం చదివాక మన పురాణాలు,ఇతిహాసాలు కొత్త కోణంలో అవగతమవుతాయి.
Additional Information
| Author | Sadguru K. sivananda murthy |
|---|---|
| Publisher | Sanathana supadha publications |
| Title | Margadarsakulu Maharshulu Part One |

